రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

23 Jan, 2017 16:30 IST|Sakshi
కీసర : మేడ్చల్‌ జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లె క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. తిమ్మాయిపల్లి నుంచి కీసర వైపు స్కూటర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు బాలాజీ నగర్‌కు చెందిన డి. హనుమంతు(26), బి. హనుమంతు(25)గా గుర్తించారు. మరొకరు సంగారెడ్డి జిల్లా బూరుగుపల్లికి చెందిన శ్రీనివాస్‌(25)గా తేల్చారు. ఈ ఘటనతో ప్రమాదస్థలంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఘటన అనంతరం ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు