-ముగ్గురికి గాయాలు
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి భద్రాచలం వైపు వస్తోన్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నున్న కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.