3 కిలోల గంజాయి స్వాధీనం

12 May, 2017 13:35 IST|Sakshi
నిజామాబాద్‌: నిజామాబాద్‌లో గంజాయి, చెరస్‌ అనే మత్తుపదార్థాన్ని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌ మాలపల్లిలో ముక్తార్‌ అన్సారీ అనే వ్యక్తిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 3.300 కిలోల గంజాయిని, 4 చెరస్‌(మత్తు మందు) గోలీలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. అతనికి ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు
మరిన్ని వార్తలు