సెల్ఫీమోజుకు ముగ్గురు విద్యార్థులు బలి

28 Aug, 2016 11:35 IST|Sakshi
సెల్ఫీమోజుకు ముగ్గురు విద్యార్థులు బలి

మాలెగావ్: సెల్ఫీ మోజు కు మరో ముగ్గురు విద్యార్థులు బలైపోయారు. ఈ ఘటన మహారాష్ట్ర్ర నాసిక్ జిల్లాలోని  సింగవ్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతులను తేజాస్ ఎం లాల్వానీ(15), కేశవ్ గ్వైకాడ్(16), అజిమ్ పఠాన్ గా గుర్తించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఐదుగురు పాఠశాల విద్యార్థులు తోటి స్నేహితుని పుట్టిన రోజును జరుపుకోవడానికి ఊరిచివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు.   అక్కడ నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవషాత్తు అందులో ఒకరు చెరువులో పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో మరో ఇద్దరు కాలులో పడిపోయారు. స్థానికుల సాయంతో మృత దేహాలను వెలికితీసిన పోలీసులు కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ విద్యార్థుల కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.
 

>
మరిన్ని వార్తలు