కుల్కచర్ల : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం బండవెలితిచర్లలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇంకుడు గుంతలో పడి భీముడు(3) అనే చిన్నారి మృతి చెందాడు. తోటిపిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.