6 నెలల్లో 94 మంది

26 Jul, 2017 16:27 IST|Sakshi
న్యూఢిల్లీ: పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఈ ఏడాది ప్రథమార్థంలో 94 మంది పౌరులను మావోయిస్టుల హతమార్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ వరకు దేశ వ్యాప్తంగా మావోయిస్టుల చేతిలో 94 మంది పౌరులు మృతిచెందారని మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ తెలిపారు.
 
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. మృతిచెందిన వారిలో అత్యధికులు గిరిజనులేనని.. వారిని హతమార్చడానికి ముందు చిత్రహింసలకు గురి చేసినట్లు పేర్కొన్నారు.
>
మరిన్ని వార్తలు