యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు..

20 Jul, 2016 20:39 IST|Sakshi
యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు..

గుర్తుతెలియని యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బెంగుళూరు నగరంలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. తుమకూరు- బెంగళూరు నాలుగో నంబర్ జాతీయ ర హదారిలోని హనుమంతపుర గేట్ వద్ద యువతి మృతదేహం కన్పించడంతో ఓ వ్యక్తి డాబస్‌పేటే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డీవైఎస్పీ రాజేంద్రకుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.

యువతి టీషర్ట్, ఫ్యాంటు ధరించి ఉందని, వయసు 20-22 ఏళ్లు ఉంటుందని, మృతదేహం రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తెల్లవారుజామున జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. స్క్రూ డ్రైవర్లతో పొడిచి, రాడ్లతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. యువతి అత్యాచారానికి గురైనట్లు ప్రాథమికంగా తేలిందని వైద్యులు తెలిపారు. పరిచయస్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక కిడ్నాప్ చేసి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు