చిత్తూరు: బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జలవనరుల శాఖ కార్యాలయంలో డీఈగా పని చేస్తున్న సూర్యనారాయణరెడ్డి కాంట్ట్రకర్లకు బిల్లులు మంజూరు చేయడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు డీఈ సూర్యనారాయణరెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అదనపు వివరాల కోసం విచారణ చేస్తున్నారు.