ఆస్పత్రిలో నటి కుష్బూ

24 May, 2019 11:08 IST|Sakshi

పెరంబూరు: నటి కుష్బూ అనూహ్యంగా అనారోగ్యానికి గురై బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. నటి కుష్బూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త కూడా అన్నది తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈమె తన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య పదవిలో ఉన్న తాను లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీవీ చర్చల్లో పాల్గొనవలసి ఉండగా ఇలా ఆస్పత్రిలో చేరడం బాధగా ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు