అన్నాడీఎంకే మాజీ మంత్రి మృతి

13 Mar, 2017 02:32 IST|Sakshi

వేలూరు : గుండెపోటుతో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్‌.విశ్వనాథన్‌ శనివారం రాత్రి మృతి చెందాడు. వేలూరు జిల్లా కావేరిపాక్కంకు చెందిన విశ్వనాథన్‌(67) అన్నాడీఎంకే పార్టీలో తూర్పు డివిజన్‌ కార్యదర్శి, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆయన అనారోగ్యం కారణంగా చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స కోసం ఈ నెల 1వ తేదీన  చేరారు. అక్కడ చికిత్సలు ఫలించక ఆయన శనివారం రాత్రి మృతి చెందాడు. విశ్వనాథన్‌ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మద్దతుదారునిగా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు.

>
మరిన్ని వార్తలు