అపోలో ప్రతాప్‌ రెడ్డికి గుండెపోటు

24 Mar, 2018 19:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటు వచ్చింది. ఆయనకు చెన్నై థౌజండ్‌ లైట్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాం పేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. ఆ వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో రాత్రంతా చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్‌ చికిత్స అనంతరం బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు