నీడా నువ్వెక్కడ..!

25 Apr, 2018 07:55 IST|Sakshi

చెన్నై,టీనగర్‌: సాధారణంగా మిట్ట మధ్యాహ్నం ఎండలో మనుషుల నీడ నేలపై కనిపించడం సర్వసాధారణం. అయితే మంగళవారం మధ్యాహ్నం 12.17 గంటలకు నీడ అసలు కనిపించలేదు. దీన్ని చెన్నై, బెంగళూరు వాసులు గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా నీడ పడకుండా సూర్యుడు నడినెత్తి పైన ఉంటాడని చెన్నై వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 18న ఈ అరుదైన ఘటన జరిగిందని, ప్రస్తుతం మరోసారి జరిగిందని వివరించారు.

మరిన్ని వార్తలు