ముందుగా మహాత్ముడికి నివాళి

28 Dec, 2013 04:28 IST|Sakshi

ఘజియాబాద్: ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించనున్నట్టు తెలిసింది. సచివాలయంలో శనివారం మధ్యాహ్నం రెండింటికి ఆయన తన తొలి మంత్రివర్గ భేటీని నిర్వహిస్తారు. ఆటోడ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం రవాణాశాఖ అధికారులతో భేటీ అవుతారు. సీఎన్జీ ధరల పెంపు ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆటో సంఘాలు కేజ్రీవాల్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించాయి.

మరిన్ని వార్తలు