'ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలు కూల్చివేత'

29 Sep, 2016 11:36 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల గురువారం నాలుగోరోజుకు చేరుకుంది. అందులోభాగంగా ఈ రోజు వివిధ సర్కిళ్లలోని టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ...బఫర్జోన్ దాటి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అలాగే చెరువుల మధ్యలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు కమిషనర్  వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు