ముగిసిన భవానీ దీక్షలు

24 Dec, 2016 12:04 IST|Sakshi
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామాత సన్నిధిలో భవానీ దీక్షాపరుల దీక్షల విరమణ ముగిసింది. ఈనెల 20వ తేదీన ప్రారంభమైన దీక్షా విరమణలు శనివారం ఉదయంతో పూర్తయ్యాయి. నాలుగున్నర లక్షల మందికి పైగా భక్తులు దీక్ష విరమించినట్లు ఆలయ అధికారుల అంచనా. కాగా, నిత్యం తెల్లవారుజామున ప్రారంభమయ్యే అమ్మవారి దర్శన కార్యక్రమాన్ని భక్తుల రద్దీ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి 12.30 నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతిలో ఆలయ ఈవో సూర్యకుమారి, అర్చకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు