భవానీ ద్వీప పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు

12 Dec, 2016 15:01 IST|Sakshi
అమరావతి: విజయవాడ నగరానికి సమీపంలో కృష్ణా నది మధ్యలో ఉన్న పర్యాటక ప్రాంతం భవానీ ద్వీపానికి మహర్దశ పట్టనుంది. ఆ ద్వీపం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భవానీ ద్వీప పర్యాటక సంస్థ(బీఐటీసీ)ను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 50 కోట్ల మూలధనంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ పరిధిలోకి అమరావతి, విజయవాడ పరిధిలోని ద్వీపాలను చేరుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 
మరిన్ని వార్తలు