‘ఎక్కడ చూసినా తొక్కిసలాటలు’

12 Dec, 2016 15:25 IST|Sakshi
‘ఎక్కడ చూసినా తొక్కిసలాటలు’

తిరుపతి: నోట్ల కష్టాలతో ప్రజల ఆక్రందనల్ని తమ గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఉక్కు పిడికిలితో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన చేసిన తమపై దౌర్జన్యాలు చేయిస్తోందని మండిపడ్డారు.

సోమవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ... చేతులకు సంకెళ్లు వేయగలరేమో కానీ గళాలకు సంకెళ్లు వేయలేరని స్పష్టం చేశారు. నోట్ల కష్టాలతో ప్రజలంతా ఆక్రందనలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతా బాగున్నట్టుగా ప్రచారం చేసుకోవడం శోచనీయమన్నారు.