ముండేకు బదులు చౌహాన్కు నివాళులు

7 Jun, 2014 13:02 IST|Sakshi

చెన్నై : బతికుండగానే ఆ నేతకు కార్యకర్తలు ఫోటో పెట్టి నివాళులు అర్పించేశారు. ఈ సంఘటన శనివారం చెన్నైలో చోటుచేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే సంస్మరణ సభలో ఆపార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పొరపాటున ముండే ఫోటోకు బదులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ ఫోటో పెట్టి నివాళులు అర్పించారు. దాంతో కార్యకర్తల అత్యుత్సాహంపై బీజేపీ అధిష్టానం మండిపడింది. తొందరపాటు చర్యలు తగవని కార్యకర్తలకు సూచించింది.

 

మరిన్ని వార్తలు