నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్న కేసీఆర్

25 Aug, 2016 22:12 IST|Sakshi
నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్న కేసీఆర్

బిజినేపల్లి: రాష్ట్రంలో కరువుతో రైతన్న అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ నీరో చక్రవర్తిలా పిడేలు వాయిస్తూ అంబారీపై ఊరేగుతున్నారని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, శాయిన్‌పల్లి, బిజినేపల్లి గ్రామాల్లో ఎండిన మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రెండున్నర ఏళ్లలో కేఎల్‌ఐ ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టకపోవడంతో సాగునీరందక ఈ ప్రాంతంలో ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే రెండవ లిప్టు ద్వారా నీరు తెచ్చి ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటల్ని నింపి రైతులను ఆదుకోవాలని నాగం డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు