ఈస్ట్‌కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు

25 Aug, 2016 19:25 IST|Sakshi
ఈస్ట్‌కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు
ఏలూరు: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు సమాచారం గురువారం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టి.. బాంబు లేదని నిర్ధారించడంతో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  . 
 
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏలూరుకు చేరుకోగానే ఓ అగంతకుడు రైల్వే పోలీసులకు రైలులో బాంబు ఉందని సమాచారం అందించాడు. దీంతో భద్రతా సిబ్బంది రైల్లోని బోగీలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా గుర్తించారు. అనంతరం రైలు యధావిధిగా బయలుదేరింది. అయితే ఫోన్ చేసిన ఆకతాయి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.  
>
మరిన్ని వార్తలు