మృత్యుంజయుడు

12 Nov, 2018 12:59 IST|Sakshi
మృత్యుంజయుడైన చిన్నారి భరత్‌

రెండవ అంతస్తు నుంచి కింద పడిన బాలుడికి స్వల్పగాయాలు

తమిళనాడు, తిరువొత్తియూరు: రెండవ అంతస్థు నుంచి కింద పడిన చిన్నారి స్పల్పగాయంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన చెన్నై మాంబలంలో చోటుచేసుకుంది. వెస్టుమాంబలం ఎం.హెచ్‌.రోడ్డులో ఉన్న బహుళ అంతస్థు భవనంలో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్‌. అతని భార్య పరిమళ. వీరికి ఒకటిన్నర సంవత్సరం కుమారుడు భరత్‌. వీరు రెండవ అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం భరత్‌ను బాల్కనీలో నిల్చోబెట్టి తల్లి పరిమళ  బిస్కెట్లు తినిపిస్తోంది. పాలు తెచ్చేందుకు పరిమళ భరత్‌ను అక్కడే వదలి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో బాల్కనీలో ఉన్న భరత్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో ఆ మార్గంలో మోటారు సైకిల్‌పై వచ్చిన వారు చిన్నారిని వెంటనే చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. భరత్‌ నుదుటిపై స్వల్పగాయమైనట్టు తెలిసింది. అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణగండం నుంచి తప్పించుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు