రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాచినేనిపల్లి పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చెరువు నిండింది. మంగళవారం మధ్యాహ్నం చెరువు వద్దకు వెళ్లిన రైతులు గండిపడిన విషయాన్ని గమనించారు. సమాచారాన్ని నీటిపారుగల శాఖ అధికారులకు తెలిపి గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.