పెళ్లి పీటల నుంచి పరీక్షకు..

19 Nov, 2018 12:39 IST|Sakshi
పరీక్ష రాస్తున్న నవవధువు శ్వేత

సాక్షి బెంగళూరు: కాలం చాలా విలువైనది అని నిరూపించింది ఓ నవవధువు. పెళ్లయిన కొన్ని క్షణాల్లోనే పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. ఈ సంఘటన ఆదివారం హాసన్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిగ్రీ బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న శ్వేతకు ఆదివారం ఉదయం 7.45 నుంచి 8.45 లోపు ఖరారు చేసిన ముహూర్తంలో వివాహమైంది. కాగా పెళ్లి పీటల నుంచి నేరుగా పరీక్ష హాలుకు వెళ్లింది. గత మే నెలలో నిశ్చితార్థం అయింది. ఇంట్లో వారు ఈనెల 18వ తేదీ పెళ్లి తేదీ ఖరారు చేశారు. అయితే పరీక్షకు గైర్హాజరయితే ఏడాది వృథా అవుతుందని భావించి పరీక్షకు హాజరయినట్లు శ్వేత తెలిపింది.  హాసన్‌లోని మహిళా కళాశాలలో పరీక్ష నిర్వహించారు.

మరిన్ని వార్తలు