చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరదయ్యపాలెం మండలం ఉబ్బలమడుగు గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.