కారు బోల్తా.. ఏడుగురికి గాయాలు

12 Oct, 2016 18:28 IST|Sakshi
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన  వరదయ్యపాలెం మండలం ఉబ్బలమడుగు గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 
 
మరిన్ని వార్తలు