'అక్షయ' కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్‌

26 Aug, 2016 15:59 IST|Sakshi
ఒంగోలు : అక్షయ గోల్డు కేసులో సీఐడీ అధికారులు ఒంగోలు కోర్టులో శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 330 కోట్ల మేర మోసం జరిగిన ఈ కేసులో 38 మంది నిందితులను చేర్చుతూ 2200 పేజీల ఛార్జ్‌షీట్‌ను సీఐడీ ఏఎస్పీ మేరీ ప్రశాంత్‌ నేతృత్వంలోని బృందం కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు 2500 ఎకరాల భూమిని సీజ్‌ చేసింది. దాదాపు 10 కోట్ల రూపాయల బ్యాంక్‌ డిపాజిట్‌ను కూడ నిలిపివేసింది. 2012 నుంచి ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
మరిన్ని వార్తలు