నగరానికి నేడు కేంద్రమంత్రి చిరంజీవి రాక

27 Sep, 2013 23:40 IST|Sakshi

సాక్షి, ముంబై: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన  తెలుగువారి కార్యక్రమానికి కూడా హాజరుకానున్నారు. కామాటిపుర ప్రాంతంలో ఆధునీకరించిన అఖిల పద్మశాలి సమాజం హాలును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మిలింద్ దేవరాతోపాటు స్థానిక ఎమ్మెల్యే అమీన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్టు సమాజం అధ్యక్షుడు దొంతుల బాలనర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఎతురాజుల గంగాధర్‌లు ఓ ప్రకటనలో తెలిపారు.
 

మరిన్ని వార్తలు