బాబుల్‌రెడ్డినగర్‌లో చైన్‌స్నాచింగ్

2 Nov, 2016 14:04 IST|Sakshi
మైలార్ దేవులపల్లి : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. వైష్ణవి  అనే మహిళ ఆమె భర్తతో స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వైష్ణవి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితురాలు మైలార్‌దైవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
మరిన్ని వార్తలు