విశాఖపట్నం: సింహాచలం గోశాలలో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. కల్యాణ మండపం, సత్రాలు, డార్మిటరీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతరాలయంలో అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు.