ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు

8 Sep, 2017 07:31 IST|Sakshi
ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు
పెరంబూరు(తమిళనాడు): ఆలయ ఉత్సవాల్లో బాణసంచా కాల్చడంపై నటుడు అరవిందస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు నటుడు అరవిందస్వామి స్థానిక తిరువాన్మియూర్‌లో నివశిస్తున్నారు. ఆయన ఇంటి సమీపంలోని ఆలయంలో రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి ఊరేగింపులో ఆ ప్రాంత ప్రజలు భారీగా పాల్గొని బాణసంచా పేల్చడంతో తన కుటుంబసభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని నటుడు అరవిందస్వామి బుధవారం రాత్రి ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఊరేగింపులో బాణసంచా పేల్చరాదని సూచించారు. అయితే ఈ విషయంలో ప్రజలు, పోలీసుల మధ్య వాగ్వదం జరిగింది. మొత్తం మీద పోలీసులు సమస్యను పరిష్కరించడంతో బాణసంచా పేల్చకుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు.   
మరిన్ని వార్తలు