ఒక్క ఓటుతో విజయం !

4 Sep, 2018 11:20 IST|Sakshi
విజేత పునీత్‌

 రాత మార్చిన పోస్టల్‌ బ్యాలెట్‌

బొమ్మనహళ్లి : ఇద్దరికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి... అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఒకరిని విజేతగా నిలిపింది. వివరాలు... ఉడిపి జిల్లా సాలిగ్రామ పట్టణ పంచాయతీ 4వ వార్డుకు బీజేపీ తరఫున కరుణాకర్, కాంగ్రెస్‌ తరఫున పునీత్‌ పూజరి బరిలో ఉన్నారు. సోమవారం జరిగిన కౌంటింగ్‌లో ఇద్దరికి సరిసమానంగా 245 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడు పర్యాయాలు ఓట్లను లెక్కించినా తేడా రాలేదు. ఇంతలో ఈ వార్డుకు ఒక పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఉన్నట్లు గుర్తించిన అధికారి, పోస్టల్‌ బ్యాలెట్‌ను తీయగా అది కూడా పునీత్‌కే ఓటు వేశారు. దీంతో పునీత్‌ను విజేతగా ప్రకటించారు. ఒక్క ఓటుతో పరాజయమైన బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌లో నిరాశ నెలకొంది. ఒక్క ఓటుతో విజయం సాధించిన పునీత్‌ను పలువురు అభినందించారు.  

మరిన్ని వార్తలు