'నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకోవాలి'

23 Oct, 2016 19:22 IST|Sakshi
'నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకోవాలి'
నిజామాబాద్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. బోధన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, జీవన్రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. 
 
నిజాం షుగర్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంతవరకు పోరాటం చేస్తామని జానారెడ్డి హెచ్చరించారు. మరో నేత ఉత్తమ్ మాట్లాడుతూ...ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పారు. 
మరిన్ని వార్తలు