కార్డన్‌ సెర్చ్‌.. 49 వాహనాలు సీజ్

31 Dec, 2016 09:45 IST|Sakshi

గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. శనివారం వేకువజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సాగిన ఈ తనిఖీలలో నలుగురు ఎస్సైలతోపాటు 70 మంది పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. స్థానిక తుంబాయిగడ్డ ప్రాంతంలో అన్ని ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు కొందరు అనుమానితులను ప్రశ్నించారు. ఎలాంటి పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలతోపాటు రెండు ఆటోలను సీజ్‌​ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు