సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రతి రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 1,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. . తాజాగా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 44, 661కు చేరింది. కరోనా ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో 38 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 435 మంది చనిపోయారు. కొత్తగా వచ్చిన కేసుల్లో 1,415 చెన్నైలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24,547 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 19,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
(చదవండి : లాక్డౌన్ పొడిగింపుపై కేంద్రం స్పందన)