తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

18 Oct, 2016 07:39 IST|Sakshi
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 24 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, కాడినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వచ్చిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు