వేములవాడకు పోటెత్తిన భక్తులు

5 Apr, 2017 12:37 IST|Sakshi
రాజన్న సిరిసిల్ల: వేములవాడ‍ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది తరలిరావడంతో.. అధికారులు చేసిన ఏర్పాట్లు సరిపోక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యాలకు తోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. క్యూలైన్లలో నిల్చున్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
మరిన్ని వార్తలు