నూకలు ఉన్నాయి కాబట్టే !

9 Nov, 2018 10:47 IST|Sakshi
పట్టాల మధ్య చిక్కిన కుక్కపిల్ల

పట్టాల మధ్య చిక్కి బతికిన శునకం

కర్ణాటక ,యశవంతపుర :  అదృష్టం ఇంటే ఇదే మరి, ఓ చిన్న కుక్కపిల్ల గురువారం రైలు పట్టాలపై నిలబడింది. ఇంతలోనే వాయు వేగంతో భారీ శబ్ధంతో ఓ రైలు వేగంగా వచ్చింది. అయినా కూడా కుక్క పిల్ల కదలకుండా రైలు పట్టాల మధ్య అలాగే ఒదిగిపోయింది. కొన్ని సెకెన్ల తరువాత మెల్లగా లేచి కుంటుకుంటు వెళ్లిపోయింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీశారు. చనిపోతుందనుకున్న శునకం అనూహ్యంగా ప్రాణాలతో బయటపడటంతో భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అంటూ చమత్కరించారు.  ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు