మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్లాల్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం మంత్రాలయం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భన్వర్ లాల్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు