ఎమ్మార్వో కార్యాలయానికి కరెంట్ కట్

31 Aug, 2016 17:50 IST|Sakshi
చిన్నశంకరంపేట: మెదక్ జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయానికి విద్యుత్ శాఖాధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ బిల్లులు బకాయి ఉండటంతో.. అధికారులు బుధవారం కరెంట్ సరఫరాను ఆపేశారు. దీంతో కంప్యూటర్లు పని చేయక ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు బకాయిలు చెల్లించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు