పళనీ త్వరలోనే అత్తగారింటికి : దినకరన్‌

16 Sep, 2017 13:16 IST|Sakshi
పళనీ త్వరలోనే అత్తగారింటికి : దినకరన్‌

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని త్వరలోనే అత్తగారింటికి(జైలు)కు పంపిస్తానని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ అన్నారు. త్వరలో జైలుకు వెళ్లేది ఆయనేనని తాను కాదని తెలిపారు. పళనీస్వామి ఇప్పటికే భయపడుతున్నారని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ మొదలుపెడితే ఎక్కడ జైలుకు వెళతారోనని బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు.

ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతోనే 19మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని మీ పక్కన పెట్టుకున్నారని పళనీస్వామి వర్గం ఆరోపిస్తుందని గుర్తు చేయగా.. 'అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో కలిసి నేను బాంబులు పెట్టానని కూడా నా విరోధులు ఆరోపిస్తారు. వాటిని మీరు నమ్ముతారా?(మీడియాను ప్రశ్నిస్తూ).. నమ్మరుగా.. దయచేసి అలాంటి అడగకండి' అంటూ దినకరన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు