హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫరీదుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.