కౌలు రైతు ఆత్మహత్య

15 Oct, 2016 14:24 IST|Sakshi
నిడదవోలు: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని లింగంపల్లిలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న నాగ విద్యాసాగర్(34) భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట సరిగ్గా పండక పోవడంతో.. పెట్టుబడుల కోసం చేసిన రూ. 5 లక్షల అప్పు చెల్లించలేనని మనస్తాపానికి గురై తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
>
మరిన్ని వార్తలు