పంట నష్టంతో రైతు ఆత్మహత్య

31 Mar, 2017 16:38 IST|Sakshi
జూపాడుబంగ్లా: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ధర్మేంద్ర నాయుడు (౩౦) గతంలో మినుములు పంట వేస్తే నష్టం వచ్చింది. దాంతో ఈ సారి వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండి పోయింది. దీంతో ఈసారి కూడా నష్టాలు తప్పవనే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
>
మరిన్ని వార్తలు