పామును తరిమేందుకు పంటకు నిప్పు పెట్టాడు!

26 Mar, 2017 12:26 IST|Sakshi
పామును తరిమేందుకు పంటకు నిప్పు పెట్టాడు!

చెన్నై(అన్నానగర్‌):
అరటి తోటలో ఉన్న పామును తరమేందుకు ఓ రైతు తోటకు నిప్పు పెట్టిన సంఘటన తమిళనాడులోని కుళిత్తలై సమీపంలో జరిగింది. దీంతో ఒకటిన్నర ఎకరాల అరటి తోట అగ్నికి ఆహుతైంది. కుళిత్తలై సమీపంలోని  మణత్తటైకు చెందిన నటరాజన్‌ (66) రైతు. ఇతను శుక్రవారం తమ్ముడి అరటి తోటలో మేకలను మేపుతున్నాడు. ఆ సమయంలో తోటలోకి పాము రావడంతో అరటి ఆకులకు నిప్పు అంటించి తరమాలని ప్రయత్నించాడు.

ఈ క్రమంలో తోటలో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి వీలు కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు ఒకటిన్నర ఎకరాల అరటి తోట మంటల్లో కాలిపోయింది.

మరిన్ని వార్తలు