సాగునీటి కోసం రైతుల ఆందోళన

12 Sep, 2016 16:52 IST|Sakshi
లింగంపేట: సాగునీటి కోసం నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు లింగంపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. మత్తైకాలువ నుంచి బోర్ల ద్వారా చెరువులను నింపుకొని కింద ఉన్న రైతుల పొట్ట కొడుతున్నారని ధర్నా దిగారు. స్థానిక ఎమ్మార్వో వచ్చి తమ సమస్య పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ధర్నా జరిగే స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు