'ఈ దేశంలో పుట్టినందుకు గర్వించండి'

13 Nov, 2016 17:15 IST|Sakshi
'ఈ దేశంలో పుట్టినందుకు గర్వించండి'

నెల్లూరు: భారత దేశంలో పుట్టినందుకు మనమంతా గర్వించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా భారత దేశం వైపు చూస్తోందని చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉంటుందని, దీపావళి రోజున మలేసియా ఎయిర్ పోర్ట్ అంతా దీపాలు వెలిగించారని చెప్పారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చారని అయితే, తన మన, ధన పరంగా స్వచ్ఛంగా ఉంటేనే ముందకెళతామని వెంకయ్య చెప్పారు.
 

మరిన్ని వార్తలు