గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

16 Feb, 2017 12:10 IST|Sakshi
సావల్యపురం: గుంటూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని సావల్యపురం మండలం బుధిలిపాలెం గ్రామంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడటంతో.. 10ఇళ్లు కాలి బూడిదయ్యాయి. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
మరిన్ని వార్తలు