తిరుమల: తిరుమల కొండపై అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్రోడ్డు 25 వ మలుపు సమీపంలో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.