రాచర్ల: ఆగకుండా కురుస్తున్న వానలతో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గుండ్లకమ్మ వాగుకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయ సమీపంలోని రంగనాయకస్వామి ఆలయ సమీపంలోకి వరద చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయానికి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. భక్తులను వెనక్కి పంపించారు. ఎవరూ అక్కడికి వెళ్లకుండా చూసేందుకు ముగ్గురు ఎస్సైలతోపాటు సిబ్బందిని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ శ్రీరాం తెలిపారు.