'అమ్మ' గొప్ప నాయకురాలు : విజయశాంతి

17 Dec, 2016 15:29 IST|Sakshi

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఘనంగా నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్లోని జయ సమాధిని శనివారం విజయశాంతి సందర్శించారు. అమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ జయలలిత గొప్ప నాయకురాలు అని కొనియాడారు. అన్నాడీఎంకే పార్టీ బాధ‍్యతలు శశికళకు అప్పగించడం సరైన నిర్ణయమేనని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు