సిరిపురంలో విషాదం

11 Oct, 2016 10:40 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా నడిగూడ మండలం సిరిపురంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు నలుగురు చెరువులోకి దిగారు. అయితే వారు దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో నీట మునిగి మరణించారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గుర్తించి... వారి మృతదేహాలను  చెరువు నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు